టాలీవుడ్ లో మహేష్ బాబు ఇప్పుడు బిజీ అవ్వడానికి చాలా గట్టిగా కష్టపడుతున్నాడు. అతను సినిమాలను ఒకప్పుడు దూకుడుగా చేసినా సరే ఇప్పుడు మాత్రం అతను చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. టాలీవుడ్ లో మహేష్ సినిమాలకు ఈ మధ్య ఆదరణ భారీగా తగ్గింది అంటున్నారు. ఇటీవల వచ్చిన సరిలేరు నీకవ్వరు సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా మీద మహేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా వసూళ్లు కూడా దారుణంగా ఉన్నాయని మహేష్ చాలా రోజుల పాటు ప్రచారం కూడా చేసినా... 

 

సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి నిర్మాతలు దర్శకులు ఎవరూ ముందుకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. దీనితోనే మహేష్ బాబు ఇప్పుడు కొన్ని కొన్ని కథల విషయంలో బాగా ఆలోచన చేస్తున్నాడని సమాచారం. ప్రశాంత్ నీల్ ఒక కథ చెప్పినా ఆ కథ మహేష్ కి నచ్చినా ఆ సినిమా ఇప్పట్లో చేసే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. ప్రశాంత్ కేజీఎఫ్ 2 తో చాలా బిజీ గా ఉన్నాడు. 

 

అతను మహేష్ తో సినిమా చెయ్యాలి అంటే కనీసం ఏడాది పట్టే అవకాశం ఉంటుంది. ఇక త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని చూసినా త్రివిక్రమ్ చాలా బిజీ గా ఉన్నాడు. దీనితో ఎప్పుడు ఎవరి తో సినిమా చెయ్యాలి అనేది మహేష్ బాబుకి ఏ విధంగా చూసినా అర్ధం కావడం లేదు. మహేష్ బాబు తన సినిమా కథల ఎంపిక విషయంలో ఇప్పుడు ఎక్కువగా జాగ్రత్త పడుతున్నాడు. దర్శకులు తెచ్చినా సరే సినిమా చేస్తాను అనే విషయాన్ని అతను గట్టిగా చెప్పే పరిస్థితిలో లేడు.

మరింత సమాచారం తెలుసుకోండి: