టాలీవుడ్ లో ఈ మద్య బాలీవుడ్ బ్యూటీలు వరుస గా విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  ఆ మద్య అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో నిధి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఆ తరవాత ‘మిస్టర్ మజ్ను’లో అఖిల్ సరసన నటించినా కలిసిరాలేదు. అయితే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నిధి అగర్వాల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఈ బ్యూటీ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు, తమిళంలో తన సత్తా చాటేందుకు మంచి ఫాలోయింగ్ పెంచుకుంటుంది.  

 

ఇప్పుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతోన్న సినిమాలో నిధి నటిస్తున్నారు. ఇందుకోసం రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటం వల్ల నిధి ఇంట్లోనే ఉంటున్నారు. తన కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తోనూ టచ్‌లో ఉంటున్నారు.  తాజాగా ఈ బ్యూటీ ఓ హీట్ ఫోటో షేర్ చేసి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. నిధి మొదటి నుంచి గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగానే ఉండేది.

 

ఇప్పటికే పలు హాట్ ఫొటోలతో షాకుల మీద షాకులిచ్చిన ఈ అమ్మడు తాజాగా కాస్త గ్లామర్ డోస్ పెంచేసి కొత్త ఫోటో పెట్టేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన   ఇన్ స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది నిధి . ఈ ఫొటోలో టవల్ చుట్టుకొని వయ్యారంగా ఫోటోకి ఫోజ్ ఇచ్చింది నిధి. ఈ ఫోటోలకు నెటిజన్లు లైక్స్ తోపాటు కొంటెగా కామెంట్లు కూడా పెడుతున్నారు.  ఈ పాట్లన్నీ దర్శక, నిర్మాతలను ప్రసన్నం చేసుకునేందుకేనా అమ్మడూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: