అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అతనితో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు అక్కడి నుంచి పోటి పడ్డారు. ఆ సినిమా ఆ రేంజ్ లో విజయం సాధించింది. ఆ సినిమా చాలా బాగుంది అని బాలీవుడ్ వర్గాలు కూడా అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

 

సినిమా విషయంలో పూరి తో పాటుగా విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటున్నారు. ఇక ఈ సినిమా కథ విషయంలో అతను వేలు పెట్టడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్న మాట. గతంలో అతను తన సినిమాల్లో ఎక్కువగా వేలు పెట్టే వాడు. కాని ఇప్పుడు మాత్రం అతను అలా చేయడం లేదు. ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత అతను చేసే సినిమా ఏంటీ అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు. అయితే అతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఆ సినిమాను ఎన్టీఆర్ తో చేసే సినిమా తర్వాత చేస్తాడు అనేది కొందరి మాట. ఆ సినిమా విషయంలో ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ కూడా ముందుకి వచ్చింది అంటున్నారు. ఈ సినిమా కథను ఇప్పటికే రెడీ చేసాడట. అయితే ఎన్టీఆర్ తో సినిమా ఉన్న నేపధ్యంలో దాన్ని పక్కన పెట్టి ఈ సినిమాను పూర్తి చెయ్యాలని భావించడం తో ఈ సినిమా ఆగింది అంటున్నారు.,

మరింత సమాచారం తెలుసుకోండి: