టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరిగే హీరోలు ఇద్దరే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వీరి గురించి టాలీవుడ్ జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ వాయిదా వేసింది. ఎలా అయినా సరే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాను తీసుకుని రావాలని జక్కన్న భావిస్తున్నాడు. 

 

సినిమాలలో 80 శాతం షూటింగ్ పూర్తి అయిపోయిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరో ప్రాజెక్ట్ ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వీరు ఇద్దరూ కలిసి ఒక దర్శకుడి తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే అది హీరో గా కాదు నిర్మాతలు గా. వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమాను నిర్మాణ సారధ్యంలో తీసుకొచ్చే ఆలోచన ఈ ఇద్దరు చేస్తున్నట్టు టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆ దర్శకుడు మాత్రం త్రివిక్రమ్ అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

సినిమా కథ కూడా దాదాపుగా రెడీ అయిందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కథ ఎక్కువగా నచ్చడం తోనే ఈ ఇద్దరు కలిసి నిర్మాతలు గా ఆ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను ఫ్యాక్షన్ రూపంలో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. కథ ఎక్కువగా హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. వీరు నటిస్తున్న సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: