టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ కొరత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పుడు ఏ హీరోయిన్ కి అవకాశం ఇవ్వాలా అనేది దర్శక నిర్మాతలకు ఒక స్పష్టత రావడం లేదు. ఎటు చూసినా సరే రష్మిక మందన పూజ హెగ్డే మినహా ఎవరూ కనపడటం లేదు ఇప్పుడు. దీని తో నిర్మాతల్లో కూడా ఒకరకమైన అసహనం అనేది వ్యక్తమవుతుంది. గతంలో ఎక్కువగా హీరోయిన్స్ ఉండే వాళ్ళు. అయితే ఇప్పుడు అది లేకుండా పోయింది అనేది అర్ధమవుతుంది. దీనితో వాళ్ళ చుట్టూ మాత్రమే హీరోలు దర్శకులు నిర్మాతలు తిరుగుతున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ తెలుగులో అడుగు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఒక నిర్మాత తో ఉన్న పరిచయాలతో సీనియర్ హీరోయిన్ ఒక ఆమె జూనియర్ హీరోయిన్ ఒక ఆమె తెలుగులో వరుసగా సినిమాలు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె అగ్ర హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతుంది. ఆ హీరో ఎవరో కాదు ఎన్టీఆర్ అని సమాచారం. నిర్మాత కూడా ఆమెను తన సినిమాలో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ఇది ఎంత వరకు నిజం అనేది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ హీరోయిన్ కోసం ఇప్పటికే బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఆమె తో సినిమాలు చేయడానికి ఎక్కువగా దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. ఆమెకు మార్కెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఆమెకు ఆ స్థాయిలో క్రేజ్ అనేది ఉంటుంది. ఇక ఆమె సినిమాలకు చేసే ప్రచారం కూడా దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. సినిమా ప్రచారాన్ని ఎక్కువగా బుజాన వేసుకుని ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: