తెలుగు బుల్లితెరపై పటాస్ కార్యక్రమంతో రచ్చ రాములమ్మగా పేరు తెచ్చుకుంది శ్రీముఖి.  అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.  దాంతో బుల్లితెరపై తన సత్తా చాటాలని నిర్ణయించుకుంది.  ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చింది.  గత ఏడాది మా టీవిలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.  ఇచ్చిన టాస్కులు చాకచక్యంతో చేసుకుంటూ అభిమానుల మద్దతుతో చివరి దాకా పోరాడింది.  ఒకదశలో బిగ్ బాస్ 3 విన్నర్ శ్రీముఖి అని డిసైడ్ కూడా అయ్యారు.. కానీ చివర్లో సింగర్ రాహూల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 టైటిల్ కొట్టేశాడు.  

 

అయితే బిగ్ బాస్ 3 తో శ్రీముఖి పాపులారిటీ కూడా బాగానే పెరిగిపోయింది.. ఈ అమ్మడికి ఇక సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తాయని భావించారు. అయితే శ్రీముఖి మాత్రం ఇప్పటి వరకు పెద్దగా ఏ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నట్లు కనిపించడం లేదు.. తిరిగి బుల్లితెరపైనే ఫోకస్ పెట్టింది. 'జులాయి' సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆమె సినిమాలకు దూరం కావడం అభిమానులను కూడా నిరాశపరించింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జులాయి’ మూవీ చేస్తున్నప్పుడే సినిమాలు వద్దని మా నాన్న చెప్పారని.. ఇదే నీ చివరి మూవీ కావాలని అన్నారు.  విచిత్రం ఏంటంటే తర్వాతనే నాకు వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి.

 

రెండుమూడు సినిమాల్లో నటించిన తర్వాత వాటికి ఫుల్ స్టాప్ పెట్టి, టీవీ షోలతో బిజీ అయ్యానని తెలిపింది. టీవీ షోలు చేస్తుంటే, సినిమా అవకాశాలు రావని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చెప్పారని... ఆయన చెప్పినట్టుగానే జరిగిందని వెల్లడించింది. కానీ రెండు మూడు సినిమాల్లో ఆఫర్ వచ్చిందని.. ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడగడం వాటికి నో చెప్పానని అన్నారు.  అలాంటివి చేయడం మన వల్ల కాదనే సినిమాలు వదులుకున్నానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: