బ‌న్నీ సుడి మామూలుగా లేదు మ‌రి. * అల వైకుంఠ‌పురములో* విజ‌యంతో మాంచి రేంజ్‌లో ఉన్న బ‌న్నీకి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఏకంగా టాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ తార‌క్‌, మ‌హేశ్‌ల‌ను వెన‌క్కి నెట్టేసి మొద‌టి స్థానంలోకి వ‌చ్చేశాడు. ఇంత‌కీ ఏ విష‌యంలో బ‌న్నీ ఫ‌స్ట్ స్థానంలోకి వ‌చ్చాడ‌ని అనుకుంటున్నారా..? ఇక అక్క‌డికే వ‌చ్చేద్దాం.. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుదల చేసిన 'పుష్ప' ఫస్ట్ లుక్ మామూలుగా పేల‌లేదు. ఒక‌రేంజ్‌లో దూసుకుపోయింది. 'అల వైకుంఠపురములో' మూవీలోని బ‌న్నీ స్టైలిష్ ఫస్ట్ లుక్ కంటే, 'పుష్పస‌గా మ‌నోడి ప‌క్కా మొరటు లుక్కే నెటిజన్లను మెప్పించింది. ఈ రెస్పాన్స్‌తో ఒక్క‌సారి బ‌న్నీ మొద‌టి స్థానంలోకి వ‌చ్చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు ట్విట్టర్‌లో అత్యధిక లైక్స్ సాధించిన తొలి టాలీవుడ్ సినిమా పోస్ట‌ర్‌గా నిలిచింది. ఇప్పటి వ‌ర‌కు అది 91.8k లైక్స్ సాధించింది. ఇది ముందుముందు ఇంకా పెరుగుతూనే ఉంటుంది.

 

నిజానికి.. అల వైకుంఠపురములో సినిమా ఇచ్చిన విజ‌యంతో బ‌న్నీ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పైగా బాక్సాఫీస్ పరంగా చూస్తే మాత్రం నాన్ బాహుబ‌లి-2 అనే చెప్పొచ్చు.  ఇక సంక్రాంతికి విడుదలైన మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో పోటీపడి మ‌రీ ఈ విజ‌యం సాధించ‌డంతో బ‌న్నీ ఆనందానికి అవ‌ధులులేకుండా పోయింది. అందుకేనేమో.. కరోనాపై పోరుకు త‌న‌వంతుగా మహేశ్ కంటే రూ. 20 లక్షలు ఎక్కువ విరాళం ఇచ్చి త‌న ఆధిప‌త్యం చాటుకున్నాడు బ‌న్నీ. ఇక అస‌లు విష‌యానికి వ‌ద్దా.. ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'అరవింద సమేత వీరరాఘవ' ఫస్ట్ లుక్ పోస్టర్‌కు 70.2k లైక్స్‌, మహేశ్ సినిమా 'మహర్షి' ఫస్ట్ లుక్ పోస్టర్ 67.2k లైక్స్ సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు 'పుష్ప' ఫస్ట్ లుక్ దాటేయ‌డంతో బ‌న్నీ మొద‌టి స్థానంలోకి వ‌చ్చేశాడు. ఇక‌ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న‌ ఈ మూవీకి సుకుమార్ ద‌ర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: