టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీయార్ ఒకరు. నందమూరి సుహాసిని జూనియర్ ఎన్టీయార్ మద్య అనుబంధం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పబ్లిక్ లో వీరిద్దరూ కలిసి పెద్దగా కనిపించకపోయినా అక్కాతమ్ముడు ఎంతో సన్నిహితంగా ఉంటారని సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి సుహాసిని ఓడిపోయారు. 
 
ఆ సమయంలో జూనియర్ ఎన్టీయార్ అక్కను గెలిపించాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నందమూరి సుహాసిని వీలు కుదిరినప్పుడల్లా జూనియర్ ఇంటికి, జూనియర్ కూడా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా అక్క సుహాసిని ఇంటికి తరచుగా వెళతారని సమాచారం. రోజులో తప్పనిసరిగా ఒక్కసారైనా ఎన్టీయార్ అక్కకు ఫోన్ చేసే క్షేమ సమాచారాలు కనుక్కుంటాడని తెలుస్తోంది. 
 
బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే జూనియర్ కు అక్క అంటే ఎంతో అభిమానం. తారక్ తన సినిమా విడుదలైన రోజున సుహాసినికి ఫోన్ చేసి సినిమాపై అభిప్రాయం తెలుసుకుంటాడని తెలుస్తోంది. నందమూరి హరికృష్ణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఎన్టీయార్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటాడనే విషయం తెలిసిందే. ఎన్టీయార్ మరో సోదరుడు జానకిరామ్ ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 
 
వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జూనియర్ రోజులో కొంత సమయం కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. నందమూరి సుహాసిని సామాజికవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2020 జనవరి 8 న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రాజమౌళి జూనియర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో సినిమా కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: