దివంగ‌త వ‌ర్థ‌మాన హీరో ఉద‌య్ కిర‌ణ్ మృతి చెంది ఆరేళ్లు అవుతున్నా అత‌డి మృతిపై అనేక ర‌కాల సందేహాలు ఉన్నాయి. ఉద‌య్ కిర‌ణ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మీడియాలో వ‌స్తూనే ఉంటోంది. తెలుగు సినిమా రంగంలో అతి త‌క్కువ టైంలోనే ఉవ్వెత్తున ఎగ‌సిప‌డిన కెర‌టంలా విఋంభించిన ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ అర్ధాంత‌రంగా ముగిసింది. ఇక ఉద‌య్ కిర‌ణ్ సినిమాల్లో ఛాన్సులు లేక ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే అత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

 

అయితే చాలా రోజుల త‌ర్వాత మస్కట్ లో సెటిల్ అయిన ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి త‌న సోద‌రుడు ఆస్తుల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న సోద‌రుడు ఆర్థిక కార‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ది అబ‌ద్ధ‌మ‌ని... మా అమ్మ అత‌డికి నాలుగు కేజీల బంగారంతో పాటు 100 కేజీల వెండి ఇచ్చింద‌ని తెలిపింది. అలాగే అత‌డు ఎప్పుడూ ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోలేద‌ని కూడా చెప్పింది. త‌న సోద‌రుడి మ‌ర‌ణంపై అనుమానాలు ఉన్నాయ‌ని.. అత‌డి భార్య విషిత త‌మ‌కు పూర్తిగా దూర‌మైంద‌ని.. తాము ఆమెను ఎప్పుడు క‌ల‌వాల‌ని అనుకుంటున్నా కూడా ఆమె కాంటాక్ట్ అవ్వ‌డం లేద‌ని చెప్పింది. 

 

ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఆ ఆస్తంతా ఆమే తీసేసుకుంద‌ని కూడా చెప్పింది. ఆమె ప్రవర్తనతో మాకు అనుమానాలు కలుగుతున్నాయి. అనేక ప్రశ్నలు మాకు తలెత్తుతున్నాయంటూ శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయిన ఆరు సంవత్సరాలకు సోద‌రి శ్రీదేవి మీడియా ముందుకు రావ‌డంతో ఇప్పుడు విషిత ఎలా స్పందిస్తుంది ? అన్న‌దానిపై అంద‌రూ వెయిట్ చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: