టాలీవుడ్ లో అడుగు పెట్టిన కొంత కాలానికి దాదాపు గా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. స్టార్ హీరోగా అగ్ర దర్శకులతో అతను సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాలో కూడా తన మార్క్ ని ఏదో విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అభిమానులు తనను ఏ విధంగా ఇష్టపడతారో అదే విధంగా కనపడే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఈ మధ్య దర్శకుల్లో క్రేజ్ ఎక్కువగా పెరిగింది అనేది వాస్తవం. అందుకే విజయ్ ఇప్పుడు కథల్లో ఎక్కువగా... 

 

వేలు పెడుతున్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. విజయ్ కథలలో వేలు పెట్టడం తోనే... ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి అనే భావనలో దర్శకులు అభిమానులు ఉన్నారు. విజయ్ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్... వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో అతను ఎక్కువగా కథలో వేలు పెట్టాడని అంటున్నారు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా సరే కాస్త వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో అతను కథలో ఎక్కువగా వేలు పెట్టాడని దీనిపై పూరి జగన్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేయడం తో అతను తన వైఖరిని మార్చుకుని మళ్ళీ ఆ తప్పు చేయను అని చెప్తున్నాడని సమాచారం. దర్శకుడు ఏ విధంగా కథ తీసుకొస్తే ఆ విధంగానే సినిమా చేస్తాను అని చెప్తున్నాడని తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: