టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఒక మంచి కమర్షియల్ స్టోరీ ని మహేష్ కి వినిపించిన పరశురామ్, మొత్తానికి ఆయనతో ఆ కథని ఒప్పించి సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సూపర్ స్టార్ సొంత బ్యానర్ అయిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఇక ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ విజయాలు అందుకుని మంచి ఊపు మీదున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో కూడా మరొక సక్సెస్ కొడతారని అంటున్నారు. 

 

ఇక దీని తరువాత మహేష్ చేయబోయే సినిమాల లిస్ట్ కూడా చాలానే ఉందనున్నట్టు సమాచారం. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా చెప్తున్నారు. అలానే ఎప్పటినుండో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కూడా రాబోయే ఏడాది ఉండనున్నట్లు టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్న రాజమౌళి, దాని అనంతరం మహేష్ తోనే సినిమా చేయనున్నట్లు చెప్తున్నారు. 

 

తమ కాంబోలో సినిమా ఉంటుందని, అయితే అది ఎప్పుడు సెట్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేం అని, అయితే అది మాత్రం దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గారి నిర్మాణంలోనే తప్పనిసరిగా ఉంటుందని సూపర్ స్టార్ మహేష్ తో పాటు రాజమౌళి కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది. నిజానికి ఈ వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం అటు మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి.ఇక రెండు రోజుల నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్, నిర్మాత నారాయణ గారు వీలైనంత త్వరలో మహేష్, రాజమౌళి సినిమా గురించి నోరు విప్పాలని, ఇప్పటికే చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలవైపు చూస్తున్నారని, కావున ఇకనైనా నారాయణ గారు ఈ సినిమా విషయమై నోరు విప్పితే తమకు ఆనందంగా ఉంటుందని పలువురు మహేష్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: