యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్నడన్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న క్రేజ్  ఏ హీరోకి లేదని అందరికీ తెలిసిందే. అంతేకాదు బాహుబలి క్రేజ్ తో సాహో' సినిమాని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన విషయం తెల్సిందే. సాహోకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కంటే సాహో తో వచ్చిన క్రేజ్ పాన్ ఇండియా హీరో రేంజ్ అని చెప్పాలి. అందుకే అందరూ ఇప్పుడు ఆ క్రేజ్ కోసం తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మించాలనుకుంటున్న ప్రతీ భారీ బడ్జెట్ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు.  

 

ఇక తాజాగా ప్రభాస్ జాన్ అన్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే సాహో రిజల్ట్ తో జాన్ కి ముందు అనుకున్న బడ్జెట్ లో కొంత తగ్గించారు. ఇక ఈ సినిమా లో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తోంది.

 

అయితే బాహుబలి ప్రాంఛైజీ తర్వాత బాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో భారీ స్థాయిలో సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ కరన్ జోహార్ ప్రభాస్ కి ఆఫర్ చేయడం గొప్ప విషయం. బాహుబలి కన్‌క్లూజన్ తర్వాత భారీగా రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసి ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారు. కాని ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేయడానికి ఆసక్తిగా లేనంటూ నో చెప్పాడు. 

 

ఈ విషయంలో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ రానా కూడా బాలీవుడ్ సినిమా ఒప్పుకోమని చెప్పాడట. అయినా ఎందుకనో ప్రభాస్ ఆసక్తిని చూపించలేదు. అయితే ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ గనక నిజంగా అప్పుడే బాలీవుడ్ సినిమాలు ఒప్పుకుంటే ఆ క్రెడిట్ వేరెలా ఉండేదని ఈ విషయంలో ప్రభాస్ పెద్ద పొరపాటు చేశాడని అభిప్రాయపడుతున్నారు. ఆలోచిస్తే ఈ విషయంలో ప్రభాస్ కాస్త రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని చాలామంది అనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: