సినిమాల్లో నటించడమే కాకుండా పలు కార్పోరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. సినిమా నిర్మాణం మల్టీప్లెక్సులు గార్మెంట్స్ బిజినెస్ లో కూడా మహేష్ హవా కొనసాగుతోంది. మహేష్ సొంతంగా జీఎంబీ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న పరిస్థితులలో ఈ బ్యానర్ కు రిలయన్స్ బ్యాకెండ్ నుంచి ఫండింగ్ ఇస్తున్నారని టాక్. 


దీనికితోడు మహేష్ జియో రిలయన్స్ టీమ్ తో కలసి భాగస్వామ్యంతో ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేద్దామని  ప్రయత్నాలు కూడ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మహేష్ తన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. 


ఇది అంతా నాణానికి ఒకవైపు మహేష్ టాప్ హీరోగా తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ అడుగులు వేస్తున్నా మహేష్ ఒక విషయంలో మటుకు మిగతా టాప్ హీరోలతో వెనకపడి ఉన్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు టాప్ హీరోలు సినిమా సినిమాకు తమ గెటప్ ను మార్చుకుంటూ డిఫరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు స్టైలిస్ట్ స్టార్ గా పేరు గాంచిన అల్లు అర్జున్ ఈమధ్యనే తన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కు సంబంధించి చూపెట్టిన డిఫరెంట్ లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది. 


రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీలో గుబురు గెడ్డంతో లుంగీతో కనిపించి తాను కూడ సినిమా సినిమాకు తన లుక్ మార్చుకోగలనని అందరికీ తెలియచేసాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే ‘జై లవ కుశ’ మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి తన రేంజ్ ని చాటుకున్నాడు. ఇక ప్రభాస్ రానా లు అయితే సినిమాలో తన పాత్రకు సంబంధించిన లుక్ కోసం ఎంతటి సాహసం చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. వాస్తవానికి మహేష్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో డిఫరెంట్ గా చూపించాలని అనీల్ రావిపూడి ఎన్నో ప్రయత్నాలు చేసినా మహేష్ లుక్ లో పెద్దగా మార్పులు కనిపించ లేదు అన్న కామెంట్స్ వచ్చాయి. దీనితో త్వరలో పరుశు రామ్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీలో అయినా మహేష్ తన లుక్ మార్చుకుని కొత్త మేకోవర్ తో కనిపించకపోతే ఈ టాప్ హీరోల రేస్ లో సూపర్ స్టార్ అయినప్పటికీ మహేష్ రానున్న రోజులలో క్రేజ్ కోల్పోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు విమర్శకులు మహేష్ కు హెచ్చరికలు ఇస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: