టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది హీరోలు నిర్మాణ రంగం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా మార్కెట్ భారీగా ఉన్న నేపధ్యంలో... ఇప్పుడు సినిమాల నిర్మాణం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత౦ టాలీవుడ్ లో ముగ్గురు నలుగురు హీరోలు నిర్మాణ రంగం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. లాభాలు కూడా ఎకువగానే ఉన్న నేపధ్యంలో హీరోలు ఎక్కువగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు నానీ అయితే వరుసగా నిర్మాతగా సినిమాలను చెయ్యాలని చూస్తున్నాడు. 

 

ప్రస్తుతం నానీ రెండు సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నానీ నిర్మాతగా రెండు సినిమాలను చెయ్యాలని చూస్తున్నాడు. అందులో ఒకటి రాజ్ తరుణ్ తో సినిమా చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని నానీ దాదాపుగా ఓకే చేసినట్టు సమాచారం. నానీ ఈ సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు సమాచారం. కథ దాదాపుగా ఓకే అయిందని అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం ఈ సినిమా వచ్చే ఏడాది మే నుంచి సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 

 

దానికి కారణం ఈ సినిమాలో నానీ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కథ తనకు బాగా నచ్చడం అందులో ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తాను వాయిస్ చెప్పాలని నానీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా మీద రాజ్ తరుణ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. రాజ్ తరుణ్సినిమా తర్వాత బిజీ అవ్వాలని చూస్తున్నాడు. అతని సినిమాలు ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అవుతున్నాయి. దీనితో ఈ సినిమాను ముందుకి తీసుకుని వెళ్లి ప్రచారం కూడా ఎక్కువగా చేసే ఆలోచనలో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: