ఈ ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ దర్శకత్వంలో అల్లు అర్జున్ - పూజా హెగ్గే కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ సినిమాలు అందించిన సుకుమార్ లో అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మద్య అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ టైటిల్ రివిల్ చేశారు. ఈ మూవీలో అల్లు అర్జున్ గందపు చక్కల దొంగతా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. తెలుగులో పాటు తమిళ, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా బన్నీ నటిస్తున్న మూవీ. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సుకుమార్ గత చిత్రాల్లోహీరో పాత్ర నెగెటివ్ టచ్తో సాగుతుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్టులుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీలకమైన పాత్రను చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు హీరోలుగా నటించిన ఇప్పుడు విలన్ పాత్రల్లో నటిస్తున్న సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, సునీల్ షెట్టి వీరిలో ఎవరినైనా తీసుకోవచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.