కరోనా వైరస్ దెబ్బకి గత పదిహేను రోజుల నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలందరూ వారి ఇళ్లకే పరిమితమయ్యారు. అంతే కాకుండా బయట కూడా ఎటువంటి మాల్స్, సినిమా థియేటర్లు ఇలా అన్నిటినీ మూసేశారు. ఒక్క నిత్య అవసరాలు మినహా ఇతర షాపులన్నీ మూతపడ్డాయని చెప్పొచ్చు. ముక్యంగా స్కూల్, ఆఫీసులు అన్నింటిని బంద్ చేయించింది ప్రభుత్వం. దీనితో పాటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సినిమా సెలబ్రెటీలు ఇలా అందరూ చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు అని చెప్పవచ్చు. అయితే  క్వారంటైన్ సమయంలో అందరూ ఎవరికి ఇష్టం వచ్చిన అలవాట్లలో వారు బిజీ అయిపోయారు ముఖ్యంగా కొందరు ఫిట్నెస్ మీద దృష్టి పెడితే మరికొందరు వంట గదులలో నిమగ్నమై పోయారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Things we do when we r locked down! I thoroughly enjoyed bringing out my inner barber ❤️😍 📸 @mastkarandar

A post shared by nisha Aggarwal (@nishaaggarwal) on


అయితే ఇక అసలు విషయానికి వస్తే... టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ కూడా తన క్వారంటైన్ సమయాన్ని తన కొడుకు ఇషాన్‌ తో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ తనతో ఆడుకుంటూ, అల్లరి చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తన కొడుక్కి హెయిర్ కట్ చేసిన వీడియో ని కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది నిషా అగర్వాల్. ఆ వీడియోకి "మనం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు చేసే పనులు ఇవే... నా లోని బార్బర్ ని బయటికి తీసుకు వచ్చినందుకు చాలా ఎంజాయ్ చేశాను" అని రాసుకొచ్చారు. అంటే ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులలో సెలూన్ షాపులు అన్నీ కూడా మూత వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో ఆమె కళ బయటకు వచ్చిందని చెప్పవచ్చు.


ఇంత ముందు టాలీవుడ్ లో నిషా అగర్వాల్ సంపత్ నంది దర్శకత్వంలో "ఏమైంది ఈ వేళ" చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళ, మలయాళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించారు. కాకపోతే ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. తర్వాతి కాలంలో బాలీవుడ్ నటుడు కరణ్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నిషా అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: