ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్  పరిస్థితుల్లో దేశంలోని అన్ని సినీ వర్గాల షూటింగ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీనితో డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఇంటికే పరిమితమై పోయారు. ఇక అసలు విషయానికి వస్తే... టాలీవుడ్ మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ మాటలతోనే మాయ చేసేస్తాడు. నిజానికి ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దర్శకుల్లో ఈయన ఒకరు. ఈయన సినిమాల్లో చాలా వైవిధ్యం కనపరుస్తారు. నిజానికి ఈయన సినిమాల్లో వచ్చే డైలాగులు మనసును ఎంతగానో హత్తుకుంటాయి. అలాగే చాలావరకు గుర్తుండిపోతాయి కూడా. నిజానికి ఈయన వందేళ్ల జీవితాన్ని కేవలం 100 అక్షరాల్లో రాయగల సిద్ధహస్తుడు అని చెప్పుకోవచ్చు.

 


ఇక ఇవన్నీ పక్కన పెడితే... ఈ సంవత్సరం మొదట్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి చేసిన అలా వైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాని తీసుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మామూలుగా ఈ చిత్రాన్ని జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లాలని అనుకున్నారు. అయితే త్రివిక్రమ్ మొదట స్క్రిప్ట్ రాసుకుని దానిని తర్వాత డైలాగ్ వెర్షన్ సిద్ధం చేసుకొని దాదాపు ఈ స్క్రిప్ట్ కోసం ఆయన ఆరునెలల సమయం తీసుకున్నారు.

 

 

కానీ పరిస్థితి ఇప్పుడు వేరేగా ఉంది. ఎన్టీఆర్ సినిమాకు ఇప్పుడు కేవలం రెండు నెలలు ఉండడంతో మొదట తను కాస్త సతమతమైనట్టు కనబడుతోంది. అయితే ప్రస్తుతం షూటింగ్ లు అన్నీ ఆగిపోవడంతో ఈ సమయం త్రివిక్రమ్ కి కలిసి వచ్చినట్టుగా అవుతోంది. దీనికి కారణం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. నిజానికి ఈ  ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోవాలి అంటే ఆగస్టు వరకు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. దీనితో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఈ సినిమాను మొదలు పెట్టాలంటే ఈ సంవత్సరం చివరి వరకు ఆగక తప్పదు. కాబట్టి ఈ సమయాన్ని త్రివిక్రమ్ స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మాటల మాంత్రికుడు నిజంగా లక్కీనే.

మరింత సమాచారం తెలుసుకోండి: