మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా, గుంటూరు జిల్లా చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలుగా రాజనాల నాగలక్ష్మి సేవలందిస్తున్నారు. కొంతకాలంగా నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమెను హైదరాబాద్ కు రప్పించి ఆపరేషన్ జరిపించేందుకు ఏర్పాట్లు చేయించిన సంగతి తెలిసిందే. ఈరోజు స్టార్ హాస్పిటల్స్ లో డాక్టర్ ఎమ్. గోపీచంద్ ఆధ్వర్యంలో నాగలక్ష్మికి ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈమేరకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

 

 

‘పద్మభూషణ్ మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారి సహాయంతో ఈరోజు రాజనాల నాగలక్ష్మి గారి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. గోపీచంద్ ఆధ్వర్యంలో సుమారు 3.30 గంటలపాటు ఆపరేషన్ జరిగింది. అందరి ప్రార్ధనలు ఫలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్జరీ విజయవంతమైందని  తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆపరేషన్ గురించి చిరంజీవి గారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. ఆపరేషన్ పూర్తవగానే చిరంజీవి గారికి డాక్టర్ గోపీచంద్ వివరాలు తెలియజేసారు. ఆప‌రేష‌న్ విజయవంతమైందని చిరంజీవి గారు చాలా సంతోషంతో మా అందరికి తెలియజేసారు. శ్రీ చిరంజీవి గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ముక్కోటి దేవతలను ప్రార్ధిద్దాము. మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.

 



ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ విజయవంతం చేసిన డాక్టర్ గోపీచంద్ గారికి.. వారి బృందానికి ధ‌న్యవాదాలు. ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి.దిలీప్ గారికి, ఇంతదూరం ప్రయాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కు ఇత‌ర సిబ్బందికి ప్రత్యేకంగా ధ‌న్యవాదాలు తెలుపుతున్నాను` అని అన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

మెగాస్టార్ చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతం పద్మభూషణ్ మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గారి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎమ్. గోపీచంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ సమయం పట్టింది అని స‌ర్జ‌రీ చాలా విజయవంతం అయ్యిందని తెలిసింది. ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స‌క్సెస్ ఫుల్ గా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆపరేషన్ గురించి మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారు. ఆపరేషన్ పూర్తి అవ్వగానే మొదటి ఫోన్ డాక్ట‌ర్.. గోపీచంద్ గారు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి తెలియజేసారు. శ్రీ చిరంజీవి గారు చాలా సంతోషంతో ఆప‌రేష‌న్ విజయవంతం అయ్యిందని మా అందరికి తెలియజేసారు. శ్రీ చిరంజీవి గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ముక్కోటి దేవతలను ప్రార్ధిద్దాము. ..రవణం స్వామినాయుడు అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ` డాక్ట‌ర్ గోపీచంద్ గారికి..వాళ్ల బృందానికి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి..ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాని` అన్నారు.

A post shared by suresh kondeti (@suresh.kondeti) on

మరింత సమాచారం తెలుసుకోండి: