టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ హవా ఎక్కువగా నడుస్తుంది. దీనికి మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు హీరోలు అగ్ర నిర్మాతలు దర్శకులు అందరూ దీన్ని ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్న మల్టీ స్టారర్... ఆర్ఆర్ఆర్సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా కాస్త వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. టాలీవుడ్ లో ఈ సినిమా గురించే చర్చలు అన్నీ కూడా. ఇది పక్కన పెడితే ఇప్పుడు మరో మల్టీ స్టారర్ కి రంగం సిద్దం చేస్తున్నారు. 

 

అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించిన చిత్రం మనం. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా టాలీవుడ్ లో అనేక రికార్డ్ లను నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమా తరహాలోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాగార్జున కు వచ్చిన ఈ ఆలోచనను సుమంత్ తో చెప్పారని దానికి సుమంత్ కూడా ఓకే అన్నారని త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా సమంతా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే... 

 

వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ మేనియా నడుస్తుంది. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో హీరోలు అందరూ నటించే అవకాశం ఉందని వంశీ పైదపల్లికి కథ రెడీ చెయ్యాలని చెప్పినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఈ సినిమా వస్తే మాత్రం వచ్చే ఏడాది దసరాకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: