టాలీవుడ్ లో పెళ్లి అయినా సరే ఎక్కువ కాలం సినిమాలు చేస్తూ వస్తున్న హీరోయిన్ సమంతా... పెళ్లి తర్వాత ఆమె మంచి సినిమాలు చేస్తుంది. పెళ్లి తర్వాత ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. ఒకటి రెండు సినిమాలు మినహా ఏవి పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే ఇటీవల వచ్చిన జాను సినిమా ఫ్లాప్ అయింది. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వచ్చిన సినిమాలో శర్వానంద్ హీరో గా నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ప్రస్తుతం సమంతా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత సమంతా సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిల్లలకు ప్లాన్ చెయ్యాలని చూస్తుంది అని కొందరు అంటున్నారు. అయితే అలా కాదు ఇక హీరోయిన్ గా సినిమాలను వద్దని ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. క్యారెక్టర్ పాత్రలు చెయ్యాలని ఆమె చూస్తున్నట్టు సమాచారం. ఒక దర్శకుడికి ఆమె ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉంది అంటున్నారు. 

 

ఇటీవల ఒక నిర్మాత ఆమె వద్దకు వచ్చి సినిమా చెయ్యాలి అని అడిగినా సరే ఆమె అంతగా ఆసక్తి చూపించలేదు అని సమాచారం. ఇక వచ్చే ఏడాది అక్కినేని ఫ్యామిలీ ఒక మల్టీ స్టారర్ సినిమాను చెయ్యాలని చూస్తుంది. ఆ సినిమాలో మాత్రం ఆమె నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఆ సినిమా వస్తుందో లేదో తెలియదు గాని కథ మాత్రం రెడీ గా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: