లీడర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రానాసినిమా తర్వాత అడపాదడపా సినిమాలలో నటించారు. ఆ సినిమాకు రానాకు మంచి పేరును తీసుకొచ్చాయి.  ఆ తర్వాత వచ్చిన బాహుబలి రానా అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉండరేమో ఎందుకంటే భల్లాల దేవిగా కనిపించి ప్రజల మన్నలను అనుకున్న రానా .. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. 

 

 

కాగా టాలీవుడ్ హీరో రానా వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే , రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ' అరణ్య' .. సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదల టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, బాహుబలి రానా కు, ఇప్పుడు ఈ సినిమాలో కనిపిస్తున్న రానా కు చాలా తేడా ఉంది అనే మాటలను కూడా అందుకున్నాడు. 

 

 


సరికొత్త కథనంతో రానున్న ఈ సినిమా కోసం 30 కిలోల బరువు తగ్గాడట. ఎందుకంటే ఈ సినిమా తెలుగుతో పాటుగా, తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల కానున్న నేపథ్యంలో రానా బరువు తగ్గారని గుసగుసలు వినపడుతున్నాయి.ఈ సినిమాలో రానా అడవిని రక్షించే ఆదివాసి పాత్రలో కనిపించనున్నారు. జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

 


ఆ సినిమాలు అయిపోయాక రానా మరో సినిమాను లైన్లో పెట్టారు.. ఇదే విషయాన్ని అభిమాని ప్రస్తావించగా, వచ్చే ఏడాది ఒక రొమాంటిక్ మూవీ చేయనున్నట్టు రానా చెప్పాడు.ఈ సినిమాలో త్రిషతో సినిమా చేస్తున్నాడనే వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో కోడై కూస్తున్నాయి. మారి వారిద్దరి ఆద్య రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా అంటే రానా అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఏ దర్శకుడితో సినిమా ఉంటుంది అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: