లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికులకు పనిలేకుండా పోయింది. సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ నిత్యావసరాలు అందిస్తోంది. అక్షయ్ కుమార్ 25కోట్ల భారీ విరాళం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. మరోవైపు అజయ్ దేవగణ్, హృతిక్, విక్కీ కౌశల్ లాంటి నటులు తమ వంతుగా సాయం చేశారు. సల్మాన్ ఖాన్ డైరెక్ట్ గా విరాళం ప్రకటించకుండా పూట గడవడం కష్టంగా ఉన్న 25వేల సినీ కార్మికులను ఆదుకుంటున్నాడు. 

 

సినీకార్మికుల అవసరాలు తీర్చడంలో భాగంగా వాళ్ల బ్యాంక్ అకౌంట్స్ ను స్వీకరించాల్సిందిగా.. ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ సంస్థను కోరాడు సల్మాన్. వాళ్లు 23వేల మంది వివరాలు సేకరించగా తొలి విడతగా.. వాళ్ల ఖాతాల్లో సల్మాన్ రూ.3వేలు జమ చేశారని ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు తివారి తెలిపారు. 

 

23వేల మందికి ఒక్కొక్కరికి 3వేల రూపాయలు జమ చేయగా.. మొత్తం 6కోట్ల 90లక్షలు ఖర్చయింది. ఫెడరేషన్ అధ్యక్షుడు తివారీ మాట్లాడుతూ.. ఒకేసారి ఎక్కువ మొత్తం జమ చేస్తే.. అనవసరంగా ఖర్చు చేస్తారన్న ఉద్దేశంతో పలు విడతల్లో ఇవ్వాలనే నిర్ణయానికి సల్మాన్ ఖాన్ వచ్చారన్నారు. త్వరలో రెండు మూడు విడతల్లో మిగతా డబ్బులను వేస్తానని ప్రకటించారు. పరిస్థితులు చక్కబడే వరకు సినీ కార్మికులు సహాయం చేస్తానని సల్మాన్ ప్రకటించారు. 

 

సల్మాన్ మాదిరి నిత్యావసరాలు అందించే క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ 3000మంది సినీ కార్మికులకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. వీళ్లతో పాటు రోహిత్ శెట్టి, బోనీ కపూర్, అర్జున్ కపూర్ ఫిల్మ్ ఫెడరేషన్ విరాళాలు అందజేశారు. ఇక ప్రొడ్యూసర్ గిల్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5కోట్లు సాయం చేసింది. తెలుగు ఇండస్ట్రీ కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఓ సంస్థను నెలకొల్పి సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: