యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'రాధే శ్యామ్'. అయితే ఇంకా ఈ టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాని ఎమోషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నారు. 'బాహుబలి', 'సాహో' సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్స్ కథలని సిద్దం చేసుకొని వేయిట్ చేస్తున్నారు.

 

ఇక బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు కరన్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా నిర్మించాలని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో చేయనున్నాడు అన్న డైరెక్టర్స్ లిస్ట్ లో తాజాగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా వచ్చి చేరింది. అయితే ఈ కాంబినేషన్ దాదాపు కన్‌ఫర్మ్ అని ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైంది.

 

2018 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది 'కేజీఎఫ్' చాప్టర్ - 1. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్ఠించింది. దాంతో ప్రశాంత్ నీల్ పేరు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఫేమస్ అయిపోయింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాదు 'కేజీఎఫ్' చాప్టర్ - 1 తర్వాత చాలా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే 'కేజీఎఫ్' చాప్టర్ - 1 కి వచ్చిన క్రేజ్ తో మళ్ళీ ఇదే కాంబినేషన్ లో 'కేజీఎఫ్' చాప్టర్ - 2 రూపొందించాలని డిసైడయ్యారు. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా 'కేజీఎఫ్' చాప్టర్ - 2 ని తెరకెక్కిస్తున్నారు.

 

ఇక తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రశాం నీల్ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని తెలుస్తుంది. ఆల్రెడి మైత్రీ మూవీస్ వాళ్ళ దగ్గర ప్రశాంత్ నీల్ డేట్స్ ఉన్నాయి. అలాగే ఎన్.టి.ఆర్ డేట్స్, ప్రభాస్ డేట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ ఇద్దరి హీరోల తో ప్రశాంత్ నీల్హీరో తో సినిమా చేస్తాడు అంటే ప్రభాస్ అనే తెలుస్తుంది. అందుకు కారణం తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ నుండి బయటకి రావడానికి ఇంకా సంవత్సరం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.దాంతో మైత్రీ వాళ్ళు ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ని సెట్ చేయాలని చూస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: