క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాంటే ఆ ఇద్దరు సాంకేతిక నిపుణులు ఉండాల్సిందే. అందులో ఒకరు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మరొకరు కెమెరామెన్ రత్న వేలు.. దేవి తో ఇప్పటివరకు అన్ని సినిమాలను చేసిన సుకుమార్ .. రత్నవేలుతో మాత్రం కొన్ని సినిమాలు మిస్ అయ్యాడు. సుకుమార్ మొదటి సినిమా జగడం దగ్గర నుండి ఆర్య , 1నేనొక్కడినే ,రంగస్థలం వరకు కెమెరా మెన్ గా పనిచేసిన రత్నవేలు ఇప్పుడు మరోసారి సుకుమార్ తీయబోయే సినిమాకు దూరమయ్యాడు.
రంగ స్థలం తరువాత సుకుమార్,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప తెరకెక్కించనున్నాడని తెలిసిందే. ఈసినిమాకు విదేశీ సాంకేతిక నిపుణుడు బ్రోజెక్ ను కెమెరామన్ గా తీసుకున్నారు. బ్రోజెక్ ఇంతకుముందు నాని నటించిన గ్యాంగ్ లీడర్ కు సినిమాటోగ్రఫీ అందించాడు. ఇక పుష్ప జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కన్నడ
బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా జగపతి బాబు ,తమిళ నటుడు
విజయ్ సేతుపతి ప్రతి నాయకులుగా కనిపించనున్నారు. రా
క్ స్టార్ దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి
మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతోపాటు ,
తమిళ ,కన్నడ ,మలయాళ ,
హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈచిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. కాగా
సుకుమార్ తో బన్నికి ఇది మూడో
సినిమా ఇంతకుముందు వీరి ఇద్దరి కాంబో లో
ఆర్య సిరీస్ తెరకెక్కింది. పుష్ప తరువాత
బన్ని, ఎంసీఏ ఫేమ్ వేణు
శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ లో నటించే అవకాశాలు వున్నాయి.