పటాస్ తో డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు స్టార్ డైరక్టర్ అనీల్ రావిపూడి. ఎంటర్టైనింగ్ సినిమాలతో ఆడియెన్స్ పల్స్ పట్టేసిన అనీల్ రావిపూడి సినిమా తీస్తే హిట్టే అన్న క్రేజ్ తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమా నుండి మహేష్ సినిమా వరకు హిట్టు సినిమాకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు అనీల్ రావిపూడి. అయితే ఈ డైరక్టర్ తన ప్రతి సినిమా కథ వైజాగ్ లో మొదలుపెడతాడట. అది అతని సెంటిమెంట్ అని చెప్పుకొచ్చాడు. 

 

ప్రస్తుతం ఎఫ్-3 కథ రాసే పనిలో ఉన్నాడు అనీల్ రావిపూడి. లాక్ డౌన్ కు ముందే వైజాగ్ వెళ్లి అక్కడ తన రైటర్స్ తో కథ మొదలు పెట్టి తన ఊరు వచ్చినట్టు చెప్పారు అనీల్ రావిపూడి. హైదరాబాద్ లో కథ రాసుకునే అవకాశం ఉంటుంది. కానీ రైటర్ టీమ్ తో వైజాగ్ లో సెపరేట్ గా ఉంటే వాళ్ళు ఫుల్ టైం దీని మీదే దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైజాగ్ లో కథ రాసుకుంటా అంటున్నాడు అనీల్ రావిపూడి. 

 

ఇక్కడ రాసుకున్న సినిమాలన్నీ వరుస హిట్లు పడుతుంటే ఇది కూడా ఒక సెంటిమెంట్ గా మారిందని చెప్పుకొచ్చాడు. సినిమా వాళ్లకు సెంటిమెంట్లు బాగా ఉంటాయి. పూరి కూడా కథ రాయాలంటే బ్యాంకాక్ దాకా వెళ్తాడు. అక్కడ తన డెన్ లో కూర్చుని కథ రాసుకుంటాడు. పూరి స్టైల్ అలా ఉంటె అనీల్ మాత్రం సింపుల్ గా వైజాగ్ లో ఒక హోటల్ లో దిగి అక్కడ కథ మొదలు పెడతాడట. ప్రస్తుతం ఎఫ్-3 కథ రాస్తున్న అనీల్ ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాకుండా మరో హీరో ఉంటాడని ఊరిస్తున్నాడు. అయితే అతనెవరు అన్నది మాత్రం రివీల్ చెయ్యట్లేదు. దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపూడి చేస్తున్న ఎఫ్-3 వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: