కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ను పొడిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ తారలు తమ అభిమానులు మరో రెండు వారాల పాటు ఒపిక పట్టాల్సింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే బెబో కరీనా కపూర్‌ తన వంతుగా లాక్‌ డౌన్‌లో ప్రభుత్వానికి సహకరించాలని మెసేజ్‌ ఇవ్వగా తాజాగా మరో యంగ్ హీరో కూడా ఇదే తరహా మెసేజ్‌ ఇచ్చాడు. అయితే రొటీన్‌గా కాకుండా తనదైన స్టైల్‌లో స్పందించాడు.

 

కరోనా వైరస్‌ ప్రభావం మొదలైన దగ్గర నుంచి వరుసగా వీడియో మెసేజ్‌ల రూపంలో అభిమానులను ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా లాక్ డౌన్‌ కొనసాగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు కార్తీక్‌ ఆర్యన్‌. తనదైన డాపర్ స్టైల్‌లో ఓ స్టిల్‌ను పోస్ట్ చేసిన కార్తిక్‌ ఆర్యన్, ఈ రోజు షాపులు బంద్‌.. రేపు రావాలి అనే కామెంట్ ను పోస్ట్ చేశాడు.

 

ప్యార్‌ కా పంచ్‌ నామా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కార్తిక్‌ ఆర్యన్‌, కరోనా వైరస్‌ ప్రభావం మొదలైన కొత్త ఓ మోనోలాగ్ ద్వారా ప్రజల్లో అవేర్‌నెస్ కలిగించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు తన వంతుగా ప్రధాన మంత్రి సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో దోస్తానా 2, భూల్‌ భులయ్యా 2 సినిమాల్లో నటిస్తున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Dukaan band hai, Kal aana

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

మరింత సమాచారం తెలుసుకోండి: