సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత మ‌రికొన్ని ప్రాజెక్టుల‌ను సైతం ప‌ట్టాలెక్కించనున్నాడు. గ‌బ్బ‌ర్ సింగ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని త‌న‌కి అందించిన హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న 28వ చిత్రాన్ని చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇది గ‌బ్బ‌ర్‌సింగ్ 2 అని ప్ర‌చారం జ‌రుగుతోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. 

 

ఇప్ప‌టికే హ‌రీష్ శంక‌ర్ - ప‌వ‌న్ కాంబోలో గ‌బ్బ‌ర్‌సింగ్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై సైతం మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ప‌వ‌న్ కాజ‌ల్‌తో ఇప్ప‌టికే స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో సైతం న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే కాజ‌ల్ ప‌వ‌న్ అన్న మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో న‌టించింది. ఇప్పుడు కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో సైతం త్రిష స్థానాన్నికాజ‌ల్ అగ‌ర్వాల్ రీప్లేస్ చేసింది. ఇక ప‌వ‌న్ 28వ సినిమాలోనూ ఇప్పుడు కాజ‌లే హీరోయిన్ అంటున్నారు. సో దీనిని బ‌ట్టి కాజ‌ల్ ఒకేసారి అటు ప‌వ‌న్‌తోనూ, ఇటు అన్న చిరుతోనూ రొమాన్స్‌కు రెడీ అవుతోంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: