కరోనా మహమ్మారి ప్రజలను రోజురోజుకీ కలవరపెడుతోంది. బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ అయిదుసార్లు పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా నుంచి బయటపడిన విషయం తెలిసిందే. మరోనటి అంకితా లోఖండే నివాసముంటున్న అపార్ట్మెంట్లో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో అపార్ట్మెంట్కి సీల్ వేశారు. ఇప్పటికే హాలీవుడ్కి చెందిన అనేక మంది నటీనటులు , సింగర్ వైరస్ బారిన పడగా, కొందరు మృత్యువాత కూడా పడ్డారు ఈ నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ కూతురుకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానికి నిర్వహించిన పరీక్షలలో ఆయనకు కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు.
అయితే కరీంకి కూడా పాజిటివ్ లక్షణాలు ఉండడంతో, ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉంటే కరీం కూతురు జోయా మోరానీ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె చెల్లి షాజాతో పాటు తండ్రి కరీం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిర్మాత కరీం మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. షాజా మొరానీ ఇటీవల శ్రీలంక నుండి భారతదేశానికి వచ్చారు.
ఆ తర్వాత ఆమెకు కరోనా సంబంధిత వైద్య పరీక్షలు జరిగాయి. అదే సమయంలో షాజా మొరానీతో పాటు, అతని సోదరి జోయా మొరాని, తండ్రి కరీం మొరానిలకు కూడా కరోనా వైద్య పరీక్షలు జరిగాయి. తాజాగా షాజా మొరాని కరోనా నెగిటివ్ అని తేలడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మన కోసం పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి నా ధన్యవాదాలు. ఇంటికి వెళుతున్నందుకు సంతోషంగా ఉంది.అని చెప్పుకొచ్చింది. కరోనా కేసులు దేశంలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే.