మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర హ్యాట్రిక్ విజయాలు అందుకుంటున్నాడు. భరత్ అనే నేను, మహర్షి తాజాగా ఇటీవల సంక్రాంతి పండుగకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మూడు వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తర్వాత సినిమా వంశీ పైడిపల్లి తో ఉంటుందని భావించినా గాని స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు సరిగ్గా చేయకపోవడంతో వంశీ సినిమాని మహేష్ పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ పరుశురాం పేరు వినబడింది. మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు కరోనా వైరస్ లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే సినిమా ఉండబోతున్నట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాత్రం మహేష్ బాబు...పరశురామ్ సినిమాని పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

 

పూర్తి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం ఇండియాలో చాలా వరకు స్టార్ హీరోలందరూ తన మార్కెట్ పెంచుకోవడానికి పాన్‌ ఇండియా లెవల్‌లో ఉండే సినిమా సబ్జెక్టు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా అదే స్థాయిలో రాణించాలని, తాజాగా యూనివర్శిల్‌ సబ్జెక్టట్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడట. ఒక్క ప్రాంతం లేదా భాషకు పరిమితం అవ్వకుండా ఉండేలా పాన్‌ ఇండియా లెవల్‌లో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌ ఉండేలా మహేష్‌బాబు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

 

ఒకవేళ యూనివర్సల్ సబ్జెక్ట్ కుదరకపోతే పరశురామ్ సినిమాని మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని మహేష్ భావిస్తున్నారట. ప్రస్తుతం మాత్రం పరశురామ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా లేదా అనేది చాలా సస్పెన్స్ గా మారింది. ఒకవేళ పాన్ ఇండియా టైపులో సినిమా ఓకే అయితే కనుక వచ్చే వేసవిలో సినిమా రిలీజ్ చేసేలా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం మహేష్ బాబు ఇతర హీరోల మాదిరిగానే యూనివర్శిల్‌ సబ్జక్ట్స్ ‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడట. పాన్ ఇండియా టైప్ స్క్రిప్టు ఎవరు తెచ్చినా సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు డైరెక్టర్లకు మహేష్ ఆఫర్ ఇచ్చారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: