సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అన్న విషయాన్ని రివీల్ చేయలేదు. పరశురామ్ తో సినిమా చేస్తాడని కన్ఫర్మ్ అయినా కూడా ఎనౌన్స్ చేయడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. పరశురామ్ తో మహేష్ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా అభిమానుల్లో ఉంది. అసలైతే వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడని అనుకున్న మహేష్సినిమా కథలో కొన్ని మార్పులు సూచించాడు. మార్చిన కథ కూడా నచ్చకపోవడంతో మహేష్ వంశీకి సారీ చెప్పాడు. 


ఇక గీతా గోవిందం తర్వాత హీరోలు దొరక్క ఖాళీగా ఉన్న పరశురామ్ కొన్నాళ్లుగా మహేష్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. మహేష్ కోసం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా కథ రాసుకున్నాడు. మహేష్ కు కథ బాగా నచ్చినా సరే పరశురామ్ మీద నమ్మకం కుదరలేదు. అయితే తను చెప్పిన ఫైనల్ వర్షన్ ఆకట్టుకోవడంతోఎలాగోలా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. గీతా గోవిందంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న పరశురామ్ తన నెక్స్ట్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. 


మహేష్, పరశురామ్ ఈ క్రేజీ కాంబో  మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కియరా అద్వానీ ఇద్దరిలో ఒకరు హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. కీర్తి సురేష్ మీద మహేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మహానటి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మిస్ ఇండియా సినిమా చేస్తున్న కీర్తి సురేష్ నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తుంది. మహేష్ తో సినిమా చేస్తే కీర్తి మళ్ళీ తెలుగులో ఫుల్  అవకాశం ఉంది. మహేష్ ఈ సినిమాలో లుక్స్ పరంగా కూడా కొత్తగా కనిపిస్తాడని తెలుస్తుంది.            

 

మరింత సమాచారం తెలుసుకోండి: