లాక్ డౌన్ పుణ్యమాని ఎప్పుడూ బిజీ గా వుండే జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. తల్లితండ్రులు తమ పిల్లలతో కాలక్షేపం చేస్తుండగా, యూత్ మాత్రం సోషల్ మీడియాలో బిజీ అయిపోయారు. లాక్ డౌన్ కారణంగా ఇంటర్నెట్ వినియోగం ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ మొబైల్స్ లో లీనమైపోయారు.


దీనికి మన టాలీవుడ్ హీరోలు ఏమాత్రం అతీతం కాదు. సాధారణంగా షూటింగుల్లో బిజీ గా ఉండే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఫ్రీ గా ఉండడంతో సోషల్ మీడియాలో తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.


"అన్నా నా లవర్ నన్ను వదిలేసి వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది ఏం చేయమంటావు నన్ను... వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై... సాటి సింగల్ గాడికి రిప్లై ఇవ్వు అన్నా" అని ప్రశ్న అడగగా "ఏముంది మన బాస్ శంకర్ దాదా ఎంబీబిఎస్ సినిమాలో చెప్పినట్లు గా చైలా, చైలా పాటను ఫాలో అవ్వడమే" అని ఫన్నీ రిప్లై ఇచ్చాడు.


ఇక ఇంకొక అభిమాని "డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో ఒక మూవీ చేస్తున్నా అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కదా ఎప్పుడు వస్తుంది ఆ మూవీ అని అడగగా" వెయిట్ ఫర్ ఇట్ అని రిప్లై ఇచ్చారు. మరికొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మహేష్ బాబు సరసన నటించడం ఎంతోకంత ఇష్టమని చిన్న పాత్ర ఇచ్చినా చేస్తా అని చెప్పారు. ఇక అల్లు అర్జున్ గురించి ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ బన్నీ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పాడు. ఎప్పుడు కొత్తదనం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: