టాలీవుడ్లో వరుస హిట్లతో తిరుగులేని డైరెక్టర్గా దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి సూపర్స్టార్ మహేష్బాబుతో సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్బస్టర్ హిట్ తీశాడు. అలాగే గతేడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబోలో ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు. ఓ విధంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి తీసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లే అవుతున్నాయి. ఇక సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత తాను ఎఫ్ 3 సినిమాకు రెడీ అవుతున్నానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
అల వైకుంఠపురంలో లాంటి సినిమాతో పోటీ పడి మరీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన అనిల్ నెక్ట్స్ సినిమాపై సహజంగానే అందరిలోనూ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎఫ్ 3 అని అనిల్ క్లారిటీ ఇచ్చినా అందులో నటించే హీరోలు, హీరోయిన్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎఫ్ 2 హీరోలే కంటిన్యూ అవుతారని.. అయితే మరో హీరో వీరికి అదనంగా వస్తాడన్న ప్రచారం జరిగింది. అయితే తన తాజా ఇంటర్వ్యూలో అనిల్ అదిరిపోయే షాక్ ఇచ్చాడు.
ఎఫ్ 3 సినిమాలో ఎఫ్ 2లో నటించిన తమన్నా, మెహరీన్లనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. హీరోయిన్ల విషయంలో ఇలా క్లారిటీ ఇచ్చిన అనిల్ హీరోల విషయంలో మాత్రం ఏం చెప్పలేదు. ఈ సినిమాలో కొత్త హీరోయిన్లు నటిస్తారు అంటూ వచ్చే వార్తలను నమ్మవద్దని కూడా చెప్పాడు. ఇక హీరోయిన్ల విషయంలో క్లారిటీ రావడంతో అసలు ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోలుగా వెంకీ, వరుణే నటిస్తారా ? లేదా ? మరో ఇద్దరు కొత్త హీరోలు వస్తారా ? అన్నది చూడాలి. మరో టాక్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోలు, హీరోయిన్లు ఉంటారని టాక్..?