టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకుంది ఈ భామ. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన్న దూసుకు పోతుంది. ఈ ఏడాది ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు.. భీష్మ చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ కు జోడీగా సుకుమార్ ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈమె తమిళం ఇంకా కన్నడ సినిమాల్లో కూడా నటిస్తూనే ఉంది. కన్నడంలో ఈమె నటించిన ‘పొగరు’ చిత్రం పాటను తాజాగా విడుదల చేశారు.

 

ఆ పాటలో హీరో ధృవ సార్జ హీరోయిన్ అయిన రష్మికను టీజ్ చేస్తూ ఉంటాడు. భయంకరమైన గెటప్ లో రౌడీ గ్యాంగ్ తో రష్మికను రాక్షసంగా టీజ్ చేస్తున్నట్లుగా ఆ పాట ఉంది. తక్కువ సమయంలోనే ఆ వీడియో సాంగ్ కు ఏకంగా 8 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. కన్నడ ప్రేక్షకులు ఆ పాటను తెగ నచ్చేశారు. పాటకు వస్తున్న స్పందన చూసి సంతోషిస్తున్న యూనిట్ సభ్యులు షాక్ అయ్యేలా మహిళ సంఘాల వారు సీరియస్ అవుతున్నారు.

 

ఆ పాటలో అమ్మాయిని అత్యంత రాక్షసంగా టీజ్ చేయడంను చూపించారు. అమ్మాయిలు అంటే అంత చులకనగా ఉన్నారా.. అది మహిళలపై దాడిని ప్రోత్సహించే విధంగా ఉంది అంటూ మహిళ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పాటను వెంటనే తొలగించాలని.. సినిమాలో కూడా ఆ పాట ఉండవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.

 

పోలీసులకు కూడా ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు వారు సిద్దమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ధృవ సార్జ.. రష్మిక జంటగా నటించిన ‘పొగరు’ చిత్రం ఈనెల 24న విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా విపత్తు నేపథ్యంలో విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు. సినిమా విడుదల సమయంలో ఈ విషయమై మరెంత రచ్చ ఉంటుందో అని యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: