యంగ్ రెబల్ అండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'జాన్' అని చిత్ర బృందం ముందునుంచి ప్రచారం చేసినప్పటికి ఆ తర్వాత ఈ సినిమా టైటిల్స్ 'ఓ డియర్' , 'రాధే శ్యామ్' అని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ రెండిటిల్లో 'రాధే శ్యామ్' టైటిల్ ఫైనల్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 'జిల్' సినిమా ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. 

 

కొన్నాళ్ళు పూజా హెగ్డే వ్యక్తిగత కారణాలతో షూటింగ్ కి బ్రేక్ పడితే ఇప్పుడు కరోనా కారణంగా బ్రేక్ పడింది. సాహో యావరే టాక్ రావడంతో వసూళ్ళకి బాగా దెబ్బ పడింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాపే అని చెప్పాలి. అందుకే ఈ సినిమాని పక్కాగా ప్లాన్స్ వేసుకొని తెరకెక్కిస్తున్నారు. కథ లో కాడా కొన్ని మార్పులు చేసి కొంత గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టారు. దీని వల్ల కూడా సినిమా కొంత డిలే అయిందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో మధ్యలోనే షూటింగ్ ఆపేసి ఇండియాకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆ సీన్స్ ని ఇక్కడే చిత్రీకరిస్తారట. 

 

అయితే ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఈ సినిమా 2020 లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదని. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా లాక్ డౌన్ ని ఈ నెల 30 వరకు పొడిగించారు. దాంతో ఈ సినిమాకి అనుకున్న షెడ్యూల్ మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందట. ఇలా మళ్ళీ పోస్ట్ పోన్ అవడం తో మిగతా వర్క్స్ అన్ని పెండింగ్ పడనున్నాయని అంటున్నారు. ఎంత నాన్ స్టాప్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయినా దసరా లేదా దీపావళి కి రిలీజ్ చేయడం కష్టం అని అంటున్నారు. ఒకరకంగా ఇది ప్రభాస్ ఫ్యాన్సే కే కాదు ప్రేక్షకులందరికి కాస్త బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: