ప్రియమణి అంటే అందరికీ చాలా అభిమానం. ఎలాంటి పాత్రనైనా ఇట్టే చేయగలుగుతుంది. తన వల్ల కాదు అన్న వాళ్ళకి చేసి చూపిస్తుంది. అందుకు ఉదాహరణ యమదొంగ సినిమాలోని సాంగ్ అని చెప్పాలి.  పరుత్తివీరన్ సినిమాలో నటించినందుకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకుంది. అలాగే తెలుగులో వల్లభ హీరోగా నటించిన ఎవరే అతగాడు సినిమాతో పరిచయమైంది. కాని ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. దాంతో ప్రియమణి కి మళ్ళీ తెలుగులో అవకాశం రాలేదు. కాని అడపా దడపా తమిళంలో మాత్రం సినిమాలు చేస్తూ ఉంది. హీరోయిన్ గా మంచి ఫాం లో ఉంది.

 

అప్పుడే తెలుగులో జగపతి బాబు హీరోగా వచ్చిన కుటుంబ కథా చిత్రం పెళ్ళైన కొత్తలో. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో నటనకి చిత్ర పరిశ్రమలోని చాలామంది పొగడ్తలతో ముంచెత్తారు. పెద్ద పెద్ద దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలు అందుకుంది. దాంతో ప్రియమణి తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. వరుసగా ఎన్.టి.ఆర్, నాగార్జున, సూర్య, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి హిట్స్ అందుకుంది. అంతేకాదు నితిన్ లాంటి కుర్ర హీరోతోను నటించి గ్లామర్ డాల్ అనిపించుకుంది. ముఖ్యంగా ద్రోణ సినిమాలో ప్రియమణి వేసిన బికినీ గురించి అలాగే పూరి జగన్నాధ్ గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన గోలీమార్ సినిమాలో మగాళ్ళు వట్టి మాయగాళ్ళే సాంగ్ గురించి, ఎన్.టి.ఆర్ తో నటించిన యమదొంగ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు.

 

అయితే ఉన్న పలంగా సినిమాలకి దూరమయింది ప్రియమణి. సినిమా అవకాశాలు తగ్గడం తో 2017 లో ముస్తఫా రాజ్ ని పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత మళయాళంలో ఒక డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించింది. అది చూసే తెలుగులో అతి పెద్ద డాన్స్ షో ఢీ సిరీస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ప్రియమణి కి తెలుగులో ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. అది కూడా విక్టరీ వెంకటేష్ సరసన. తమిళంలో భారీ హిట్ అయిన అసురన్ రీమేక్ తెలుగులో వెంకటేష్ తో నారప్ప గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

 

దాంతో మళ్ళీ కం బ్యాక్ అయి ఈ సినిమాతో హిట్ అందుకొని సీనియర్స్ పక్క అవకాశాలు సంపాదించుకోవాలనుకుంది. కాని కరోనా కారణంగా తాజాగా నెలకొన్న పరిస్థితులు తెలిసందే. ఈ నేపథ్యంలో ప్రియమణి కి పెళ్ళి తర్వాత వచ్చిన అవకాశం తో పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో పాపం అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: