నిత్యం షూటింగ్ లతో బిజీగా వుండే సినీ స్టార్స్ కు కరోనా వల్ల ఫ్యామిలీతో గడిపే సమయం దొరికింది. అందులో భాగంగా మాస్ మహారాజ్ రవితేజ తన ఫ్యామిలీతో ఈ క్వారంటైన్ టైం ను సరదాగా గడుపుతున్నాడు. ఈ సందర్బంగా రవితేజ తన కుమార్తె మరియు కుమారుడు తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుమారుడు మహాధన్ రాజా ది గ్రేట్ లో జూనియర్ రవితేజ గా కనిపించాడు. ఈసినిమా తరువాత అతను మరో సినిమాలో కనిపించలేదు. 
 
ఇక గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమవుతున్న రవితేజ ,క్రాక్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 8న విడుదలకావాల్సి వుంది. అయితే కరోనా వల్ల ఆ విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదలతేది ని ప్రకటించనున్నారు. ఈచిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రఖని , చిరాగ్ జానీ ,వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన క్రాక్ టీజర్ సూపర్ రెస్పాన్ ను తెచ్చుకోవడంతో సినిమా పై మంచి అంచనాలు వున్నాయి. 
 
ఇక ఈ సినిమా తరువాత రవితేజ ,రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. కాగా రమేష్ వర్మ తో రవితేజ కు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన వీర డిజాస్టర్ అయ్యింది. ఇక ఇటీవల రవితేజ  మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో రవితేజ సినిమా చేయనుండగా నా పేరు సూర్య తో డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ డైరెక్షన్ లో నటించడానికి  కూడా రవితేజ ఓకే చెప్పాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: