టాలీవుడ్ లో దగ్గుబాటి హీరో రానా హడావుడి ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. ఆయన సినిమాల మీద ఆయన ప్రకటనలు కార్యక్రమాల మీద కూడా ఒకప్పుడు చర్చలు ఎక్కువగా జరిగేవి. యూత్ లో కూడా అతనికి ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉండేది. బాహుబలి సినిమా తర్వాత ఇది ఎక్కువగా కనపడింది. అయితే ఇప్పుడు రానా చాలా వరకు సైలెంట్ గా ఉన్నాడు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా రానా పెద్దగా ఎక్కడా కూడా ఏ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి కనపడటం లేదు. 

 

అతను బరువు తగ్గి తన సినిమాలను తాను చేస్తున్నాడు గాని ఎక్కడా కూడా హడావుడి అనేది చేసే పరిస్థితి దాదాపుగా లేదు. రెండు మూడు సినిమాల్లో ఇప్పుడు నటిస్తున్నాడు. దాని గురించి కూడా ఎక్కువగా అతను హడావుడి చేసిన సందర్భం అంటూ ఏదీ లేదు కూడా. దీనికి స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేకపోయినా కొన్ని కొన్ని రూమర్స్ కి దూరంగా ఉండటమే అని అంటున్నారు. రూమర్స్ ఎక్కువ కావడం తో అతను ఇబ్బంది పడుతున్నాడని అందుకే బాలీవుడ్ కి కూడా చాలా దూరంగా ఉంటున్నాడు అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

అతను ప్రస్తుతం అరణ్య సహా విరాట పర్వం అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత అతను తేజా దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా కథ దాదాపుగా రెడీ అయింది కూడా. మరి రానా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనేది సరైన కారణం అనేది తెలియదు. కాని అతని దృష్టి ఇప్పుడు పెళ్లి మీద ఉంది అనేది కొందరి మాట. త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి తర్వాత తండ్రి నిర్మాణ సంస్థ బాధ్యతలను తాను తీసుకునే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: