ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్ని విలవిల లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటించటంతో పాటు విరాళాలు సేకరించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. అదే బాటలో హాలీవుడ్‌ నటి, పాప్‌ గాయని రిహానా కూడా తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.

 

ఈ సందర్భంగా ఆమె భారీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ భామ ఫెంటీ సోషల్ క్లబ్‌ పార్టీకి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ షోను నిర్వహించింది. అయితే ఈ లైవ్‌లో భాగంగా అభిమానులు చాలా మంది ఆమెను నెక్ట్స్ ఆల్బమ్‌ ఎప్పుడూ అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలపై చిర్రెత్తుకొచ్చిన రిహానా కాస్త ఘాటుగానే స్పందించింది. బూతులతో రెచ్చి పోయింది.

 

మీడియాలో చెప్పడానికి వీలులేని బూతులు ఉపయోగిస్తూ.. మీ అధ్యక్షుడిలా కాకుండా నేను ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో ఉంటే మీరు నా నెక్ట్స్ ఆల్బమ్‌ గురించి అడుగుతారా.. అంటూ ఫైర్‌ అయ్యింది. అయితే ఇప్పటికే తన ఫౌండేషన్‌ ద్వారా 5 మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించింది. ఆ మొత్తాన్ని ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారికి భోజనం అందించేందుకు వినియోగించాలని ఆమె కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: