టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల మార్కెట్ పెరగడం ఏమో గాని అందరూ కూడా ఇప్పుడు నిర్మాతల అవతారం ఎత్తే ప్రయత్నాల్లో ఉన్నారు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ కూడా సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించాలి అని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు వారి బాటలోనే హీరోయిన్ లు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో ఏ హీరోయిన్ కూడా సినిమా నిర్మించాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నిర్మాతలు గా మారడానికి హీరోయిన్ లు చాలా కష్టపడుతున్నారు. 

 

త్వరగా సినిమాలు చేయడానికి ఆశ పడుతున్నారు. రష్మిక మందానా, పూజా హెగ్డే ఇలా చాలా మంది హీరోయిన్ లు నిర్మాతలుగా మారడానికి కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సమంతా ఇప్పుడు నిర్మాత కావడానికి ఎక్కువగా ఎదురు చూస్తుంది అనే విషయం అర్ధమవుతుంది. సమంతా నిర్మాత గా మారడానికి గానూ ఒక కథను కూడా రెడీ చేసుకుంది అంటున్నారు. ఆ కథ పూర్తిగా రెడీ అయిన తర్వాత ఆమె సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. వచ్చే ఏడాది ఆమె పూర్తి స్థాయి నిర్మాతగా మారడమే కాదు, 

 

ఇక హీరోయిన్ గా కూడా సినిమాలను చేయకుండా ఉండాలని ఆమె భావిస్తుంది. టాలీవుడ్ లో సమంతాకు ఇప్పుడు డిమాండ్ అంతగా లేదు. ఆమెనుచాలా మంది దర్శకులు పక్కన పెట్టారు కూడా. అయినా సరే ఆమె ఏదోక సినిమాలో కనపడుతూనే ఉంది. ఇప్పుడు హీరోయిన్ గా ఇక ఆపేసి నిర్మాతగా సినిమాలను చెయ్యాలని చూస్తుంది. ఇక తన మైండ్ లో ఒక కథ కూడా ఉందని సమాచారం. ఆ సినిమాను చేయడానికి ఆమె ఎక్కువగా సిద్దపదినట్టు తెలుస్తుంది. ఎలా అయినా సరే ఆ కథను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలి అని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: