విజిల్ సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు అట్లీ కుమార్ ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారుతున్నాడు. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిన అట్లీ చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అట్లీ అతి తొందరగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. రాజా రాణి, అదిరింది, పోలీస్, విజిల్ అనువాదాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరయ్యాడు.

 

అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి తెలుగు హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మొదటగా ఎన్టీఆర్ ఆసక్తి కనబరచగా అట్లీ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశం బాగా ఉంది. అయితే స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అట్లీ నిర్మాతగా మారుతున్నాడు. దర్శకులు నిర్మాతలుగా మారడం సహజమే. తమకున్న స్టార్ డమ్ వల్ల కొన్ని కథల్ని చెప్పలేకపోవడంతో నిర్మాతగా మారి వాటిని జనాలకి చేరవేస్తున్నారు.

 

తెలుగులో చాలా మంది దర్శకులు ఇలా నిర్మాతలుగా సినిమాలు తెరకెక్కించారు. తమిళంలో మురుగదాస్ జర్నీ చిత్రానికి డబ్బులు పెట్టాడు. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే అట్లీ కూడా నిర్మాతగా ఏ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి
 తన ప్రయత్నం చేస్తున్నాడు. తాను నిర్మాతగా వ్యవహరించే సినిమాలో రంగం ఫేమ్ జీవా హీరోగా నటిస్తున్నాడు. సంగాలీ బెంగాలీ కదావ తోవ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మన తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.

 

 

శ్రీ దివ్య తెలుగులో సక్సెస్ కాలేకపోయినా తమిళంలో అవకాశాలే బాగానే తెచ్చుకుంటుంది. మరి డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ సినిమా ఆమెకి విజయాన్ని చేకూర్చుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: