టాలీవుడ్ లో ప్రభాస్ కి బాహుబలి సినిమా తర్వాత డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికి తెలిసిందే. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆ తర్వాత పోటీ పడినా సరే ప్రభాస్ మాత్రం కమర్షియల్ గా దేశం మొత్తం ఆడే సినిమానే లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ కూడా చేసినా సరే ఇప్పుడు కరోనా కారణంగా సినిమాను వాయిదా వేసారు. 

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేస్తాడు అని భావించారు. ఆ సినిమా కథ కూడా దాదాపుగా రెడీ కూడా చేసినా ఆయన మాత్రం ఆ కథను పెద్దగా పట్టించుకోలేదు అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ ఒక భారీ ప్రాజెక్ట్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను సెట్స్ మీదకు వేగంగా తీసుకుని వెళ్ళే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది అని టాక్. 

 

ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు అందరు కూడా యువ దర్శకులతోనే సినిమాలు చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. యువ ధర్శకులనే కథలను రెడీ చేయమని ప్రభాస్ చెప్పినట్టు సమాచారం. కొత్త దర్శకులను పరిచయం చెయ్యాలని కథ బాగుంటే వాళ్ళతో సినిమా చెయ్యాలని ప్రభాస్ భావిస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. నిర్మాతలకు కూడా ప్రభాస్ ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. యువ దర్శకుల మీద అతనికి చాలా నమ్మకమట.

మరింత సమాచారం తెలుసుకోండి: