టాలీవుడ్ లో కొరటాల శివ కు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కథలు సామాజిక కోణం లో ఉండటమే కాకుండా కమర్షియల్ గా కూడా ఉండటం తో అగ్ర దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువగా పోటీ పడుతున్నారు. మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఎవరు చూసినా సరే ఆయనతో సినిమా చేయడానికి గానూ తమ వేరే సినిమాలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేది. ఇక ఇప్పుడు ఆచార్య అనే సినిమాను కొరటాల ఇప్పుడు చిరంజీవి హీరోగా చేస్తున్నారు. 

 

ప్రస్తుత౦ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ని ఆపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల చేసే సినిమా ఏంటీ అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తి. అయితే కొరటాల ఇప్పుడు అందరూ కూడా అగ్ర హీరోలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. చిరంజీవి తో సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా సామాజిక కోణంలో ఒక సందేశం ఇచ్చే విధంగా ఉంటుంది అనేది టాలీవుడ్ జనాల మాట. ఈ సినిమాకు సంబంధించిన కథ ఎప్పుడో రెడీ చేసుకున్నారని కూడా సమాచారం. ఆ కథను ఇప్పుడు తుది మెరుగులు దిద్ది లైన్ లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

భరత్ అను నేను సినిమా సమయంలోనే ఈ సినిమా కథను రెడీ చేయగా అప్పుడు మహేష్ బాబు భరత్ అను నేను కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఈ కథను రెడీ చేయమని సినిమా చేద్దామని మైత్రీ మూవీ మేకర్స్ కి పంపగా వాళ్ళు కూడా ఈ సినిమాను చేయడానికి ఆసక్తి చూపించారు అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: