యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శశకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేశారు తారక్. ఈ చిత్రంలో ఆయన కొమరం భీమ్ రోల్ చేస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన కెరీర్లో 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటెర్టైమెంట్స్ రాధాకృష్ణ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతక ముందు వీరి కాంబినేషన్ లో  'అరవింద సమేత.. వీర రాఘవ' సినిమా వచ్చి విజయం సాధించింది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్  తాజా చిత్రం వచ్చే ఏడాది విడుదల సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. 

 

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటోనే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఈ క్వారంటైన్ సమయంలో ఇంటిలో ఉంటూనే కొందరు దర్శకుల నుండి కథలు వింటున్నాడని సమాచారం. అలాగే ఈసారి ఆయన ఇతర సినీ పరిశ్రమలలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ తో కమిటై అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. నిజానికి సౌత్ లో స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న యంగ్ డైరెక్టర్ అట్లీ, ప్రశాంత్ నీల్ లలో ఎవరో ఒకరితో ఎన్టీఆర్ మూవీ చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తో అయితే ఆల్మోస్ట్ మూవీ కన్ఫర్మ్ అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ తారక్ కి నచ్చిందని.. ఆయన పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అట్లీ కూడా షారుక్ ఖాన్, విజయ్ సినిమాల తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడట. ఇదిలా ఉండగా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసి త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవుతాడు. ఆర్.ఆర్.ఆర్ లో తారక్ ఇంట్రో వీడియో ఆయన బర్త్ డే సందర్భంగా మే 20న రానున్నదని సమాచారం. 

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: