టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. సినిమాల్లో ఎంతటి పాపులారిటీ దక్కించుకున్నాడో తెలిసిందే. వరుస ఫ్లాపులు వచ్చిన వెరవని పవన్ పవన్ కల్యాణ్ కు ఆడియన్స్ కూడా క్రేజ్ అలానే పెరుగుతూ వచ్చింది. అయిదేళ్ల క్రితం నుంచి సినిమాలు తగ్గించుకుంటూ వచ్చిన పవన్ కల్యాణ్ రెండేళ్ల నుంచి పూర్తిగా సినిమాలు మానేశాడు. రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. మళ్లీ సినిమాలు చేయాలని నిశ్చయించుకుని ఒకేసారి రెండు ప్రాజెక్టులు షూటింగ్ లో పెట్టాడు. ఈ సినిమాలు ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి.

 

 

ఈ సినిమాల గురించి అప్డేట్స్ కోసం చూస్తున్న పవన్ అభిమానులకు ఆయన చిన్న అన్నయ్య నాగబాబు నుంచి వచ్చిన న్యూస్ కాస్త ఊరటని ఇస్తున్నాయి. పింక్ రీమేక్ పై పవన్ ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. తెలుగులో ఆ సినిమా చేయాల్సి వస్తే తానే చేస్తానని తనతో చెప్పినట్టు నాగబాబు చెప్తున్నాడు. ఇక క్రిష్ సినిమాను పవన్ చాలా ఆసక్తితో చేస్తున్నాడని చెప్తున్నాడు. మొఘలాయిల నాటి కాలం కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నాడు. కోహినూర్ వజ్రం చుట్టూ కథ ఉంటుందని కూడా నాగబాబు చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలింనగర్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

 

 

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ ఈసరికి షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. మే 15న విడుదలవ్వాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదే విడుదల కానుంది. త్వరలో ఈ సినిమాల షూటింగ్స్ జరుగనున్నాయి. మరి నాగబాబు చెప్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజమెంతుందో కానీ ఈ న్యూస్ తో అభిమానులు మాత్రం ఖుషీ అయిపోతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: