ఈ రోజుల్లో వచ్చే అన్ని చిన్న చితకా సినిమాలు బోల్డ్ కంటెంట్ ని మాత్రమే గుడ్డిగా నమ్ముకుంటున్నాయి. రొమాంటిక్ సీన్లు లేకపోతే తమ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎవరూ రారేమోనని... కుటుంబంతో కలసి చూడలేనటువంటి శృంగార భరిత సన్నివేశాలను అనవసరంగా తమ సినిమాల్లో చూపిస్తున్నారు. చూసుకున్నోడికి చూసుకున్నంత అన్నట్టు ట్రైలర్స్, సినిమా పోస్టర్లు కూడా రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. కొంతమంది దర్శక, నిర్మాతలు తమ సినిమాలో 20 కిస్ సన్నివేశాలు ఉన్నాయని పబ్లిక్ గానే చెప్పడం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే... సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కుమారులు కూడా బాగా శృంగారభరితమైన సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు.


మాస్ మసాలా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి రొమాంటిక్ అనే ఓ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు అనిల్ యాదవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ గతంలోనే విడుదల కాగా... అది వీక్షించిన చాలా మంది నెటిజన్లు అశ్లీలత సన్నివేశాల గురించి తప్పుబట్టారు.


అయితే రొమాంటిక్ సినిమా యొక్క చిత్రీకరణ గోవాలో ఎక్కువగా జరపగా... కొంతమేరకు హైదరాబాదులో జరిగింది. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు సినిమాలోని మంచి పాటలను హైదరాబాద్, గోవాలో షూట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి టాక్. ఈ సినిమా వ్యతిరేకంగా దాదాపు పూర్తి అవ్వగా... పోస్ట్ ప్రొడక్షన్ పనులలో పడిపోయారు ఆ సినీ బృందం. రమ్యకృష్ణ, మందిరా బేడీ కీలక పాత్రలో నటిస్తుండగా... కథానాయికగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటిస్తోంది.


అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చి నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. అదేంటంటే... ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ ఘాటైన లిప్ కిస్ సన్నివేశం ఉంటుందట. ఆ లిప్ కిస్ సన్నివేశం కోసమైనా... సినిమా చూడొచ్చు అని ఆ చిత్ర యూనిట్ చెబుతున్నారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమాని మే 29వ తారీఖున రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ... కరోనా వైరస్ కారణం గా రిలీజ్ డేట్ కొన్ని రోజుల పాటు వాయిదా పడుతోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: