టాలీవుడ్ లోకి ఈ మద్య మాలీవుడ్ బ్యూటీలు ఎంతో మంది వస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు.  అదృష్టం కొద్ది వీరి నటిస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి. దాంతో తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో టాప్ హీరోయిన్లు గా మారిపోతున్నారు. ఆ మద్య రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్.  ఈ సినిమా మంచి సక్సెస్ తర్వాత నాని నటించిన నేను లోకల్ మరో ఘన విజయం అందుకుంది.  ఇలా రెండు సినిమాలు హిట్ టాక్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’తో బ్లాక్ బస్టర్ అందుకుంది.  

 

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ‘మహానటి’ మూవీలో అచ్చం సావిత్రిని పోలినట్టే కీర్తి సురేష్ ఉండటం.. నటన కూడా ఆమెలా నటించడంతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  అయితే కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తెగ బిజీ అయ్యింది. మహానటి సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి ఆ సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కించుకుంది.  ఇక మహానటి తర్వాత కీర్తి సురేష్ కి బాగా కలిసి వచ్చిందని.. ఓవర్‌నైట్ స్టార్‌ హీరోయిన్ గా మారిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

తాజాగా ఈ విషయం పై స్పందించిన ఈ మాలీవుడ్ బ్యూటీ.. ఊహించిన దానికంటే తక్కువ సమయంలోనే నేను ఉన్నత స్థానానికి చేరుకున్నాను. అయితే ఓవర్‌నైట్‌లో స్టార్‌ని అయిపోలేదు. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. నాకు సీనీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా.. ఒక పాత్ర లో నటించాలంటే ఎంత కష్టపడాలో అన్న విషయం నా అనుభవాలు నేర్పాయి.   రిస్క్ తీసుకుని ప్రయోగాత్మక పాత్రల వైపు అడుగులేశాను. చాలా తక్కువ సమయంలోనే జాతీయ అవార్డు సాధించాను. జాతీయ అవార్డును నేను కలలో కూడా ఊహించలేద ని కీర్తి చెప్పింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: