టాలీవుడ్ లక్కీ హీరోయిన్ ,టాప్ హీరోయిన్ అంటే మొదట గా వినిపడేది పూజా హెగ్డే అని చెప్పొచ్చు..వరుస విజయాలతో అమ్మడు ఫుల్ బిజీ గా గడిపేస్తుంది.స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది అంతే కాకూండా వరుస హిట్లు కూడా చూస్తుంది.మహేష్ పక్కన మహర్షి సినిమాలో నటిచింది..ఆ సినిమా పెద్ద విజయమే సాధించింది..మళ్ళి ఆ విజయమే అమ్మడు కి మరో ఛాన్స్ ఇచ్చింది..అవును మహేష్ బాబు

పక్కన మరోసారి ఛాన్స్ కొట్టేసింది అని టాలీవూడ్ టాక్..

 

పూజా హెగ్డే కెరియర్ స్టార్ట్ లో ప్లాప్స్ చూసింది.ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేశారు టాలీవుడ్  ప్రేక్షకులు.కానీ ఎక్కడ నిరుత్సా పడకుండా అవకాశం కోసం ఎదురు చూసింది..అల్లు అర్జున్ సినిమాలో హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాధం అనే సినిమాలో నటించింది.ఈ సినిమా కమర్షియల్ గా  హిట్ కాకపోయినా  అమ్మడు అందాలు ఆరబోత కి కుర్రకారు ఫిదా అయింది. ఈ సినిమాలో నటనకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమాలో అవకాశం ఇచ్చారు .

 


ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో  వచ్చిన  అరవింద సమేతాలో పూజా నటనకి  టాలీవూడ్  ఫిదా అయింది.అంతే  కాకుండా తెలుగు లో తక్కువ సినిమాలు చేసిన సొంతగా డబ్బింగ్ చెప్పుకొని అందరి మెప్పు పొందింది..ఆలా మహర్షి  సినిమాలో కూడా తన దైన రీతోలో నటిచించి అందరిని ఆకర్షించింది..అదే విజయం తో ఆలా వైకుంఠపురంలో ఛాన్స్ కొట్టేసి మరో పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంది..ఇప్పుడు మరో ఛాన్స్ మహేష్ బాబు పక్కన కొట్టేసింది అని ఇండస్ట్రీ టాక్..ప్రస్తుతం పూజా ప్రభాస్ ,అఖిల్ సినిమాల్లో బిజీ బిజీ గా గడుపుతుంది . పారితోషికం భారీ గా పెంచింది. బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ స్టార్ హీరోలు పూజా హెగ్డే కు అవకాశాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: