ముందుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కమెడియన్ గా పరిచయమైన నటుడు బండ్ల గణేష్, మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ అప్పట్లో చాలా సినిమాల్లో కమెడియన్ గా మంచి పాత్రల్లో నటించడం జరిగింది. ఇటీవల కొన్నేళ్ల క్రితం సడన్ గా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి, మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో ఒక్కసారిగా నిర్మాతగా అవతారం ఎత్తారు బండ్ల. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాత తన ఫేవరెట్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జయంత్ దర్శకత్వంలో తీన్ మార్ సినిమా నిర్మించిన బండ్ల, రెండవ సారి కూడా ఫ్లాప్ ని అందుకున్నారు. 

 

ఇక ఆపై మరొక్కసారి పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాని కూడా నిర్మించిన బండ్ల, ఆ సినిమా తో ఒక్కసారిగా అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ తో బాద్షా నిర్మించి మరొక హిట్ ని అందుకున్న బండ్ల, ఆపై ఇద్దరమ్మాయిలతో, నీజతగా నేనుండాలి, గోవిందుడు అందరివాడేలే సినిమాలతో పరాజయాలు చవిచూశారు. వాటి తరువాత మరొక్కసారి ఎన్టీఆర్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా నిర్మించిన బండ్ల, మొత్తానికి హిట్ కొట్టారు. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల, మొన్నటి తెలంగాణ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ పై కొంత సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 

 

ఆ తరువాత పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బండ్ల, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు ద్వారా మరొక్కసారి కమెడియన్ గా కనపడడం జరిగింది. ఇక మూడు రోజులుగా బండ్ల ట్విట్టర్ అకౌంట్ కనుక గమనిస్తే, ఆయన వరుసగా సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్టులను పెడుతుండడం టాలీవుడ్ లో కొంత ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ఎప్పుడూ తనకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీ హీరోలను గురించి పోస్టులు చేసే బండ్ల, ఇలా ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ పోస్టులు పెడుతున్నారు అంటే ఈ విధంగా బాబుని కాకా పడుతున్నారా ఏంటి, కొంపతీసి త్వరలో ఆయనతో సినిమా నిర్మించడం లేదు కదా అంటూ కొందరు అడుగుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి బండ్ల ఎందుకని సూపర్ స్టార్ ని టార్గెట్ చేసారో తెలియాలంటే మరికొద్దిరోజలు ఆగవలసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: