అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ షాలిని పాండే. ఆ తర్వాత సినిమాలైతే చేస్తుంది కానీ అందుకు తగినట్టు సక్సెస్ అందుకోవట్లేదు. మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించిన షాలిని పాండే మళ్ళీ తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఛాన్స్ రావాలె కానీ ఈసారి మరింత రెచ్చిపోయేందుకు కూడా సిద్ధమని హింట్ ఇస్తుంది ఈ అమ్మడు. 

 

తెలుగులో హీరోయిన్ గా ఐడెంటిటీ తెచ్చుకున్న షాలిని ప్రసుత్తం తమిళ, హిందీ సినిమా ఆఫర్లు అందుకుంటుంది. అయితే తెలుగులో చేయడానికే అమ్మడు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుందని తెలుస్తుంది. ఇక క్వారెంటైన్ టైం లో షాలిని ఒక మెసేజ్ కూడా ఇస్తుంది. నీ జీవితం నీదే.. నీ మీద ఎవరు అధికారం చెలాయించేలా అవకాశం ఇవ్వొద్దు. మన జీవితం మీద వేరొకరి ఆధిపత్యం భరించడం చాలా కష్టం అందుకే అలాంటి వారికి దూరంగా ఉండటమే బెటర్ అంటుంది షాలిని పాండే. ఇంతకీ ఈ హీరోయిన్ ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పింది అన్న దాని మీద నెటిజెన్ల రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 

 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ హీరోయిన్ ను ఎవరైనా తమ కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందం అభినయం రెండు ఉన్న ఈ అమ్మడు కథల విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్తే మాత్రం కెరియర్ రిస్క్ లో పడినట్టే లెక్క. ప్రసుత్తం అనుష్క లీడ్ రోల్ లో నటించిన నిశ్శబ్దం సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించింది షాలిని పాండే. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమా మీదే ఉన్నట్టు తెలుస్తుంది. నిశ్శబ్దం సక్సెస్ అయితే షాలిని మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: