టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే రష్మిక మందన హవా ఎక్కువగా కనపడుతుంది. ఈ ఇద్దరు తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్స్ గా మారిన సంగతి తెలిసిందే. వరుస ఆఫర్లతో ఇద్దరు కూడా సంచలనం సృష్టిస్తున్నారు. అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ ఇప్పుడు దూసుకుపోతున్నారు. అగ్ర దర్శకులు హీరోలు కూడా వాళ్ళతో సినిమాలు చేయడానికి ఎక్కవగా ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా ఆఫర్స్ ఈ ఇద్దరికే వస్తున్నాయి. పారితోషికం ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళను మాత్రం వదిలే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. 

 

ఇక ఇది ఇలా ఉంటే పూజ హెగ్డే ఇప్పుడు మహేష్ బాబుకి లక్కీ హీరోయిన్ అయింది అంటున్నరు. ఆయన ఆమెతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. చేసింది ఒక సినిమానే అయినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహర్షి సినిమా సూపర్ హిట్ కావడం పూజ హెగ్డే చేసిన హీరోలు అందరూ కూడా హిట్ బాట పట్టడం తో ఇప్పుడు తనకు కూడా పూజ లెగ్ కలిసి వస్తుంది అనే భావనలో మహేష్ బాబు ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమె తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

 

ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో పూజ రెండు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: